Swan india వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు .బుధవారం రాత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభ కార్యక్రమంలో తోపులాట జరిగి 8 మంది మృత్యువాత పడగా తనను ఎంతో కలచి వేసిందని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేనిపక్షంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి కుటుంబాలకు తీరని లోటు ఏర్పడుతుందని ఎంత డబ్బు ఇచ్చినా వాటిని పూడ్చలేమని ఆయన దిగ్భ్రాంతిని వెళ్లబుచ్చుతూ మృతులకు 23 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్కువని దాదాపు 5 కోట్ల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు